స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే – దువ్వాడ జగన్నాథం భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లకు పైగా షేర్, ప్రపంచవ్యాప్తంగా 23 కోట్లకు పైగా షేర్, దాదాపుగా 34 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించి అల్లు అర్జున్ కెరీర్ లో అతిపెద్ద ఓపెనింగ్ డే రికార్డు సృష్టిచింది.
ఓ చిత్రమైన విషయం ఏమింటంటే, నిన్నటిరోజే విడుదలైన సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ ని మొదటిరోజు డామినేట్ చేసింది డీజే.
ప్రపంచవ్యాప్తంగా 5500 స్క్రీన్స్ లో విడుదలైన ట్యూబ్ లైట్ ఇండియాలో కేవలం 21 కోట్ల నెట్ సాధించగా, డిజే 23 కోట్ల నెట్ సాధించింది.
ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ రెండు సినిమాలు 34 కోట్ల దాకే కలెక్ట్ చేయగా 5500 స్క్రీన్స్ లో విడుదలైన ట్యూబ్ లైట్ కి, 1500 స్క్రీన్స్ లో విడుదలైన డీజేకి పెద్దగా తేడా లేకపోవడం గమనించదగ్గ విషయం.మొదటిరోజు ఆక్యూపెన్సి విషయంలో డీజే ట్యూబ్ లైట్ మూడురేట్లతో ఓడించింది.
దక్షిణాది సినిమాల ఓపెనింగ్స్ లో డీజేది 10వ స్థానం కాగా, తెలుగు సినిమాల ఓపెనింగ్స్ లలో ఏడొవ స్థానం.కేవలం ఇండియాలోనే కాదు, అమెరికాలోనూ డిజే మొదటిరోజు కలెక్షన్లు ట్యూబ్ లైట్ కంటే చాలా ఎక్కువ.
ఈరకంగా తక్కువ స్క్రీన్స్ తో సల్మాన్ ఖాన్ గాలి తీసేసాడు బన్ని.చెప్పాలంటే పరువు కూడా.
ఇప్పుడు బాలివుడ్ లో ఇదో పెద్ద టాపిక్ అయి కూర్చుంది.బాహుబలి తరువాత డీజే రూపంలో బాలివుడ్ కి మరో దెబ్బ తగిలిందని బాలివుడ్ క్రిటిక్స్ సైతం బాలివుడ్ పై, సల్మాన్ ఖాన్ పై విమర్శలు చేస్తున్నారు.