స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో అవార్డ్ వచ్చి చేరింది.ఏసియా నెట్ మలయాళ చానెళ్ వారు అల్లు అర్జున్ కు ‘ప్రవసి రత్న’ అనే పురస్కారంతో సత్కరించారు.
తెలుగుతో పాటు తన సినిమాలను మలయాళంలో కూడా రిలీజ్ చేస్తూ అల్లు అర్జున్ కాస్తా మల్లు అర్జున్ అనే స్థాయికి ఎదిగిన మన బన్ని మిడిల్ ఈస్ట్ లో పలు అవార్డ్ ఫంక్షన్స్ తో సందడి చేసే ఏసియా నెట్ నుండి అవార్డ్ అందుకోవడం గొప్ప విషయమే.మలయాళంలో బన్ని క్రేజ్ దృష్ట్యా ఈ పురస్కారాన్ని అందించినట్టు తెలుస్తుంది.
తన ప్రతి సినిమా అక్కడ డబ్ చేయించి రిలీజ్ చేసే బన్ని రీసెంట్ గా సరైనోడు సినిమా యోధుడుగా రిలీజ్ చేసి అక్కడ సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బన్ని త్వరలో తెలుగు, మలయాళ బైలింగ్వల్ చేస్తా అని అక్కడ ఫ్యాన్స్ కు మాటిచ్చాడు.
మరి ఈ అవార్డ్ తో బన్ని మీద ఉన్న ప్రేమను ఈ రకంగా తెలిపిన మలయాళ మీడియా ఇప్పుడు కచ్చితంగా తెలుగు, మలయాళ బైలింగ్వల్ తీసేందుకు ప్రోత్సహిస్తుంది.ఏది ఏమైనా మలయాళంలో బన్ని క్రేజ్ చూస్తుంటే మిగతా హీరోలంతా ఖుళ్లు కుంటున్నారని చెప్పొచ్చు.