మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం పేరు ధృవ.తమిళంలో భారి విజయాన్ని సాధించిన తాని ఒరువన్ కి ఇది రీమేక్.
సురేందర్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత, రకుల్ ప్రీత్ కథానాయిక.
ఈ చిత్రం యొక్క షూటింగ్ ఇప్పటికే మూడు నాలుగు సార్లు వాయిదాపడింది.
ప్రతీసారి చరణ్ ఏదోక సాకు చెప్పి షూటింగ్ మొదలుపెట్టట్లేదట.చరణ్ వ్యవహారంపై ఈ సినిమా విలన్ అరవింద స్వామీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారని వార్తలు వస్తున్నాయి.
చరణ్ వలన ఆర్టిస్టులు సినిమాకి ఇచ్చిన డేట్స్ అయిపోతూ ఉండటంతో, నిర్మాత అల్లు అరవింద్ కి తలనొప్పి మొదలైంది.
ఇన్నిరోజులపాటు ఓపిగ్గా ఉన్న అల్లు అరవింద్, చేసేదేమీ లేక చిరంజీవిని కలిసారట.
అబ్బాయి సినిమాని సరిగా పట్టించుకోవట్లేదని, తనకి నచ్చజెప్పమని, చరణ్ వలన చాలా నష్టం వస్తోందని అన్ని విషయాలు విడమరిచి చెప్పారట.మరి దీనికి చిరంజీవి ఎలా స్పందిస్తారో, చరణ్ కి ఏమని చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫిలింనగర్ ప్రజలు.