టాలీవుడ్లోకి మరో వారసుడు రాబోతున్నాడు.ఇప్పటికే ఎంతో మంది వారసులు వచ్చి తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతూనే ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న తెలుగు స్టార్ హీరోల్లో దాదాపుగా అంతా కూడా వారసులే అనే విషయం ఒప్పుకోక తప్పని నిజం.ప్రస్తుతం ఉన్న వారసులు సరిపోరన్నట్లుగా నెలకొక్కరు చొప్పున ఎవరో ఒకరు వారసులుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ అవుతూనే ఉన్నారు.
ఇదే క్రమంలో త్వరలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీ తనయుడు సంజీవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
సంజీవ్కు సినిమాలంటే ఆసక్తి లేకపోయినా కూడా ఒక యువ దర్శకుడు తన వద్ద ఒక మంచి కథ ఉందని చెప్పి, హీరోగా నటించేందుకు ఈయన్ను ఒప్పించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.సంజీవ్ నటనలో కూడా శిక్షణ తీసుకోబోతున్నాడు.
ఒక ప్రముఖ నిర్మాత సంజీవ్ హీరోగా సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.మరి ఈ వారసుడు ఎలాంటి ఫలితాన్ని సాధిస్తాడో చూడాలి.
ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతాడా లేక మధ్యలోనే వెళ్లి పోతాడా అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది.