సూపర్స్టార్ మహేష్బాబు సంపాదనలో తెలుగు హీరోల్లో నెం.1 స్థానంలో ఉన్న విషయం తెల్సిందే.సినిమాలతోనే కాకుండా యాడ్స్ ద్వారా కూడా ఈయన కోట్లల్లో ప్రతీ సంవత్సరం ఆధాయాన్ని సంపాదిస్తున్నాడు.అయితే ఇంత సంపాదన ఏం చేస్తున్నాడు మహేష్బాబు అనే అనుమానం కమెడియన్ అలీకి వచ్చిందట.
అనుమానం వచ్చిందే తడువుగా నేరుగా మహేష్బాబుతో ఈ విషయాన్ని అడిగాడట అలీ.అప్పుడు అలీ ఆశ్చర్యపోయే విషయాన్ని మహేష్బాబు చెప్పినట్లుగా తెలుస్తోంది.
తాజాగా అలీ మహేష్బాబు సంపాదన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.మహేష్బాబు సంపాదన గురించి తనకు వచ్చిన అనుమానం గురించి స్వయంగా ఆయనతోనే మాట్లాడాను.అప్పుడు ఆయన తన సంపాదనలో దాదాపుగా 30 శాతంను చారిటీ కోసం ఉపయోగిస్తానంటూ పేర్కొన్నాడు.ఆ చారిటీ పనులు స్వయంగా మహేష్బాబు భార్య నమ్రత చూసుకుంటుందని కూడా అలీ చెప్పుకొచ్చాడు.
ఓల్డేజ్ హోమ్లకు ఎక్కువ మహేష్బాబు డొనోషన్లు ఇస్తాడని తెలుస్తోంది.ఆదాయంలో 30 శాతం మహేష్బాబు విరాళాలు ఇస్తాడని తెలిసి తాను ఆశ్చర్యపోయానంటూ అలీ అంటున్నారు.
మొత్తానికి వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు మహేష్.మహేష్లా అందరు హీరోలు చారిటీకి ముందుకు వస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.