‘ఒక లైలా కోసం’ మూవీ తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య నటించిన చిత్రం ‘దోచేయ్’.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చి 20వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఉగాది సందర్బంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ శరవేగంగా నిర్మాణానంత కార్యక్రమాలు జరుపుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుతున్నారు.
‘స్వామిరారా’ సినిమా తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడంతో అందరి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.దొంగతనాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో చైతూ దొంగగా కనిపించనున్నాడు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్కు మంచి స్పందన వస్తోంది.
మహేష్బాబు సరసన ‘1’ సినిమాలో నటించిన కృతిసనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.ఈ సినిమాతో సక్సెస్ జర్నీని చైతూ కొనసాగిస్తాడేమో చూడాలి.