అఖిల్ అక్కినేని – శ్రియ భూపాల్ ల నిశ్చితార్థం గత ఏడాది డిసెంబరులో జరిగిన సంగతి తెలిసిందే.అఖిల్, శ్రియల మధ్య కొన్నేళ్ళుగా మంచి స్నేహం ఉండటం, ఇద్దరి మనసులు కలవటంతో, ఈ జంటని ఒక్కటి చేసేందుకు ఇరువైపుల కుటుంబ పెద్దలు ఒప్పుకోవడంతో ఈ వేసవిలో పెళ్ళిని నిశ్చయించారు.
అయితే, మే నెలలో, ఇటలీలో జరగాల్సిన వీరి పెళ్ళి క్యాన్సిల్ అయినట్లు ఓ జాతీయ దినపత్రిక సమాచారం.
విషయంలోకి వెళితే, మేలో ఇటలీకి పెళ్ళిరోజు కోసం టికేట్స్ బుక్ చేసుకున్న అతిథులందరిని తమ టికేట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా ఇరు వర్గాల కుటుంబ పెద్దలు మెసెజ్లు పెట్టారంట.
అంతేకాదు, అక్కినేని కుటుంబం, శ్రియ కుటుంబసభ్యులు కూడా తమ టికేట్స్ క్యాన్సిల్ చేసుకున్నారట.దీనర్థం, మేలో ఇటలీలో జరగాల్సిన వివాహా వేడుక క్యాన్సిల్ అయినట్లే.
మరి పెళ్ళి ఇప్పుడే వద్దు అని అనుకుంటున్నారా లేక వీరిద్దరికి పెళ్ళి వద్దు అని అనుకుంటున్నారా తెలియదు.వివాహ వేడుకలను ఎందుకు నిలిపివేస్తున్నారనే విషయం ఇంకా బయటపడలేదు.