అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ తన మొదటి సినిమా తర్వాత సంవత్సరం పైగా గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు సెకండ్ మూవీ స్టార్ట్ అయ్యే లోపే తను చేసే మూడో సినిమాను కూడా ఫిక్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.అఖిల్ రెండో సినిమా విక్రం కుమార్ డైరక్షన్లో ఓకే అవగా థర్డ్ మూవీ కోసం మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయాలని అనుకుంటున్నాడట.
మొదటి సినిమా అఖిల్ తోనే మాస్ ఫాలోయింగ్ అని ఫ్లాప్ ఫేజ్ చేశాడు అఖిల్ మళ్లీ బోయపాటి సినిమా కూడా అదే కోవలో ఉంటుంది.
అయితే బోయపాటి మార్క్ సెపరేట్ గా ఉంటుంది.
అందుకే ఆయనతో సినిమా కోసం స్టార్ హీరోలు క్యూ కడుతుంటారు.ఈ సంవత్సరం సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ శ్రీను సినిమా చేస్తున్నాడు.
అది కూడా నిర్మాతల గొడవల వల్ల ఆగిపోయే అవకాశాలున్నాయట సో అదే జరిగితే అఖిల్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్టే.అయినా కూడా నాగార్జున ఓకే అంటే మాత్రం బోయపాటి కూడా సినిమా చేసేందుకు స్పీడ్ అందుకునే ఛాన్స్ ఉంది.
.