టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆ మాటకు వస్తే తెలుగు సినీజనాలతోనే అక్కినేని ఫ్యామిలీకి విడదీయలేని బలమైన అనుబంధం ఉంది.
ప్రస్తుతం ఈ ఫ్యామిలీలో మూడో తరం వారసులుగా ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున ఇద్దరు తనయులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్.అనూహ్యంగా వీరిద్దరు ఒకేసారి ప్రేమలో పడ్డారు.
చైతు స్టార్ హీరోయిన్ సమంతతోను, అఖిల్ జీవీకే మనువరాలు శ్రియా భూపాల్ను ప్రేమించారు.నాగ్ వీరిద్దరికి ఈ యేడాదే పెళ్లి చేసేందుకు డిసైడ్ అయ్యాడు.
ఈ క్రమంలోనే అఖిల్కు – ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన జీవీకే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్రెడ్డితో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.ఇటలీలో కళ్లుమిరుమిట్లు గొలిపేలా వీరిద్దరి పెళ్లి జరుగుతుందని అనుకుంటున్న టైంలో వీరి మధ్య తీవ్రమైన గ్యాప్ రావడంతో పెళ్లి పీఠలెక్కకుండానే క్యాన్సిల్ అయ్యింది.
ఈ దెబ్బకు నాగార్జున కొద్ది రోజుల వరకు బయటకే రాలేదు.
ఈ పెళ్లి క్యాన్సిల్ తర్వాత అఖిల్ సినిమాలు చేసుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు జీవీకే ఫ్యామిలీ నాగార్జున ఆస్తుల కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్న ఓ ఎన్నారై కోటీశ్వరుడితో శ్రియా భూపాల్ పెళ్లి ఫిక్స్ చేసిందట.అమెరికాలో సెటిల్ అయిన ఆ ఎన్నారై యువకుడు అక్కడ పలు బిజినెస్లు చేస్తూ కోట్లకు పడగలెత్తాడట.
ఈ యేడాదిలోనే ఆ యువకుడితో శ్రియా పెళ్లి ఉంటుందని సమాచారం.
.