అక్కినేని అఖిల్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
అక్కినేని ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా సాయేషా సైగల్ నటిస్తోంది.అఖిల్కు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా టీజర్ను విడుదల చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చిత్ర నిర్మాత నితిన్ ప్రకటించాడు.
రేపు అఖిల్ పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేస్తామని నితిన్ తాజాగా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రెడీ అయ్యిందని తెలుస్తోంది.ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ కాలేదు.
రేపు అఖిల్ పుట్టిన రోజు సందర్బంగా అఖిల్ మూవీ టైటిల్ కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించే అవకాశాలున్నాయి.ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులను అఖిల్ విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం అని దర్శకుడు వినాయక్ చెబుతున్నాడు.
పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా దర్శకుడు ప్రకటించాడు.ఖర్చుకు నెరవకుండా నితిన్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.