ఎయిర్ టెల్ మరో ఆకర్షణీయమైన 4G/3G డేటా ఆఫర్ తో ముందుకి వచ్చింది.₹250 చెల్లించి 1GB డేటా ప్యాక్ ని కొంటే, అదనంగా మరో 14GB అందిస్తోంది.అయితే ఇందులో కొన్ని షరతులు లేకపోలేదు.ఈ ఆఫర్ కేవలం సాంసంగ్ వినియోగదార్లకే ప్రకటించింది ఎయిర్ టెల్.అది కూడా కొన్ని మోడల్స్ కే.ఈ సాంసంగ్ మోడల్స్ మీ దగ్గర ఉంటే ఈ ఆఫర్ ని అందుకోవచ్చు.
* గెలాక్సి జే2 (2015)
* గెలాక్సి జే5 (2015)
* గెలాక్సి జే5 (2016)
* గెలాక్సి జే7 (2015)
* గెలాక్సి జే7 (2016)
* గెలాక్సి జే2 ప్రో
* గెలాక్సి జే మ్యాక్స్
పైన పేర్కొనబడిన మోడల్స్ కి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇక ఆఫర్ ఎలా పొందాలంటే … ఎయిర్ టెల్ ఇంటర్నెట్ సర్వీస్ వాడుతూ (WiFi కాదు) www.airtellive.com లో offers పేజిలోకి వెళ్ళి అక్కడ ఇచ్చిన సూచనలు పాటించి యాక్టివేట్ చేసుకున్నాక మీ మెయిన్ అకౌంట్ లోంచి రిఛార్జ్ డబ్బులు కట్ అయిపోయి ఆఫర్ మీ నంబర్ పై మొదలవుతుంది.
ఈ ఆఫర్ లో అదనంగా వచ్చిన 14GB డేటాని 4G యూజర్లు ఎప్పుడైనా వాడుకోవచ్చు.అదే 3G వినియాగదారులైతే రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటలలోపే వాడుకోవాలి.