టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు తాజాగా ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించిన విషయం తెల్సిందే.మరో నాలుగు రోజుల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.
ఊరిని దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది.భారీ అంచనాలున్న ఈ సినిమాకు భారీ బిజినెస్ అయ్యింది.
కొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
ఇక ఈ సినిమా విడుదల తర్వాత మహేష్బాబు తాను కూడా ఒక ఊరును దత్తత తీసుకుంటాను అంటూ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
తన తండ్రి కృష్ణ జన్మస్థలం అయిన బుర్రిపాలెంను తాను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.తన బావ ఎంపీ గల్లా జయదేవ్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అన్నట్లుగానే ఊరిని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తే టాలీవుడ్లో మహేష్బాబు గొప్పోడవుతాడు.ఎవ్వరికి అందని ఎత్తులో మహేష్ నిుస్తాడు.