కీరవాణి తర్వాత జక్కన్న ఎవరితో..?

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి ప్రతి ఒక్క సినిమా సూపర్‌ హిట్‌ అవుతూ వస్తోంది.ఈయన కెరీర్‌ ప్రారంభించిన దగ్గర నుండి ఒక్క సినిమా కూడా ఫ్లాప్‌ కాలేదు.

 After Keeravani Retirement Rajamouli Opt For Devi Sri-TeluguStop.com

ఈయన అన్ని సినిమాల్లో కూడా సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటూ వస్తున్నాయి.ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో పాటలు ఎన్నో సూపర్బ్‌ టాక్‌ను తెచ్చుకున్నాయి.

ఈయన కెరీర్‌ ఆరంభించిన దగ్గర నుండి కూడా తన సినిమాలకు కీరవాణితో సంగీతం చేయిస్తున్నాడు.ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండటంతో ఎన్నో సక్సెస్‌ు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి.

కొన్నాళ్ల క్రితం కీరవాణి తాను సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లుగా ప్రకటించాడు.సోషల్‌ మీడియాలో స్వయంగా కీరవాణి పోస్ట్‌ చేశాడు.

తాజాగా కూడా కీరవాణి మరోసారి రిటైర్‌మెంట్‌ విషయంపై స్పందించాడు.దాంతో కీరవాణి సినిమాల నుండి తప్పుకుంటే రాజమౌళి తన సినిమాలకు సంగీత దర్శకుడిగా ఎవరిని ఎంపిక చేసుకుంటాడు అనే టాక్‌ వస్తోంది.

దీనికి సమాధానంగా రాజమౌళి సన్నిహితులు దేవిశ్రీ ప్రసాద్‌ పేరు చెబుతున్నారు.కీరవాణి తర్వాత సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్‌ అంటే రాజమౌళికి చాలా అభిమానం అని, దేవిశ్రీ ప్రసాద్‌ పాటలను రాజమౌళి ఎక్కువగా వింటాడు అని చెబుతున్నారు.

‘బాహుబలి’ రెండవ పార్ట్‌ ముగిసిన తర్వాత జక్కన్న తెరకెక్కించబోయే సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని ఇస్తాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube