టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అద్బుత చిత్రం ‘బాహుబలి’ విడుదలకు సిద్దం అయ్యింది.మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలు అయ్యింది.
ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా భారీ స్థాయిలో బెన్ఫిట్ షోలను వేసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.ప్రముఖ నగరాల్లో బెన్ఫిట్ షోలు వేసే థియేటర్లను ఎంపిక చేయడం కూడా జరిగింది.
దాంతో అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యింది.
కూకట్పల్లిలోని విశ్వనాధ్ థియేటర్లో ‘బాహుబలి’ బెన్ఫిట్ షోను 10వ తారీకు తెల్లవారు జామున 2 గంటలకు వేసేందుకు రంగం సిద్దం అయ్యింది.
ఇప్పటికే ఆ షోకు టికెట్లు పూర్తి అయ్యాయి.ఈ థియేటర్లో ఏ,బీ,సీ,డీ వరుసల్లో కూర్చునేందుకు 3000 రూపాయలు, బాల్కనీ 2000 రూపాయలు, మద్యలో కూర్చునేందుకు 1500 రూపాయలు, ముందు కూర్చునేందుకు 1000 రూపాయల చొప్పున టికెట్లు అమ్మినట్లుగా తెలుస్తోంది.
ఇక విడుదల రోజు బ్లాక్లో ఈ టికెట్ల ధర 10,000 రూపాయలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.ఈ స్థాయిలో టికెట్ల రేట్లు ఉండటంతో సాదారణ ప్రేక్షకుడు సినిమా చూసేందుకు భయపడుతున్నాడు.