హైదరాబాద్ లో ఒక మాయ లేడీ హడావిడి చేసింది…తన మాటలతో ముగ్గులోకి దింపి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు స్వాహా చేసేసింది.కాకపోతే ఆమె పధకం బెడిసి కొట్టి జైలు పాలయింది.
అసలు వివరాల్లోకి వెళితే.కర్ణాటకకు చెందిన ఈ మహిళ పటాన్ చెరు మండలం బీరంగూడలో ‘ ఆధ్యత డిజైనర్ క్రియేషన్’ పేరుతో ఓ సంస్థను స్థాపించింది.
అంతే కాకుండా ఈ సంస్థ తరపు ప్రజల్లో ముఖ్యంగా మహిళలకు ఎన్నో ఆకర్షన పథకాలు పెట్టి చాలా మంది మహిళలను తన బుట్టలో వేసుకుంది వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది.తాను అనుకున్న ప్రకారం రాత్రికి రాత్రి బోర్డు తిప్పేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు.
కార్యాలయంపై దాడి చేశారు.ఆమెను కొట్టి, పోలీసులకు అప్పగించారు.
కార్యాలయంలోని సామాగ్రి మొత్తాన్ని బాధితులు తీసుకువెళ్లారు.ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.