కొన్ని సందర్బాల్లో సెలబ్రెటీలు అభిమానుల అభిమానం తట్టుకోలేక వారిపైనే కోపాన్ని ప్రదర్శిస్తారు.ముఖ్యంగా హీరోయిన్స్ తమ అందాన్ని ఆరాధించే అభిమానులపై పదే పదే కోపం వ్యక్తం చేస్తూ ఉంటారు.
తాజాగా హీరోయిన్ విశాఖ సింగ్ కూడా తన కోపాన్ని ఫ్యాన్స్పై చూపించింది.తాజాగా ఈమె ట్విట్టర్లో ఒక ఫొటోను ట్వీట్ చేసింది.
ఆ ఫొటోకు ఆమె అభిమానులు చాలా అందంగా ఉన్నావు, చక్కన్న సొగసులు, అందమైన బ్రెస్ట్, మంచి నడుము అంటూ ఆమె అందాలను వర్ణించారు.దాంతో ఈమెకు చిర్రెత్తుకు వచ్చింది.
తన అందాలను కామెంట్స్ చేసిన వారిపై ఒక్కసారిగా ఫైర్ అయ్యింది.మీ అమ్మ, అక్కలను కూడా అలాగే చూస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అడది అంటే అదే చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అందాలు చూపుతూ ఫొటో పెట్టడం తప్పు కాదు కాని, ఆ అందాలు బాగున్నాయి అంటే ఈమెకు తప్పు వచ్చిందా అంటూ కొందరు విమర్శిస్తున్నారు.
మా అమ్మ అక్కలు నీలాగా డ్రస్లు వేసుకోరు అంటూ కొందరు ఆమెపై రివర్స్ పంచ్లు వేశారు.మొత్తానికి ఈ వ్యవహారం ట్విట్టర్లో హాట్ హాట్గా సాగుతోంది.
విశాఖ సంగ్ ఇటీవలే నారా రోహిత్ రౌడీ ఫెల్లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే.