తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటూ, వరుసగా సక్సెస్లు అందుకుంటూ దూసుకు పోతుంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.ఈ అమ్మడు ఇటీవలే ‘లౌక్యం’ సినిమాతో సూపర్ హిట్ను అందుకున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన ‘కిక్`2’ సినిమాలో నటిస్తోంది.ఆ సినిమాపై కూడా ఈ అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అవ్వడంతో ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజాగా ఈఅమ్మడు మరో బంపర్ ఆఫర్ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
యంగ్టైగర్ ఎన్టీఆర్ సరసన ఈమెను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ప్రస్తుతం ‘టెంపర్’ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం సుకుమార్ పలువురు హీరోయిన్లను పరిశీలించి ఆ తర్వాత రకుల్ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్తో చేసే అవకాశం వచ్చినందుకు ఈ అమ్మడు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతోంది.మరి ఎన్టీఆర్తో చేసే సినిమా సక్సెస్ అయ్యి, ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.