మా అధ్యక్ష ఎన్నికలను చూస్తూంటే టాలీవుడ్లో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి సంబంధాలు ఉన్నాయా అని అనిపిస్తుంది.ఇప్పటి వరకు టాలీవుడ్లో సెలబ్రెటీలు అంతా కూడా కలిసి మెలిసి ఉంటారని ఆశించిన ప్రేక్షకులు ఈ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్య పోతున్నారు.
రాజేంద్రప్రసాద్ మరియు జయసుధలు పోటీ చేస్తున్న ఈ ఎన్నికలో ఆరోపణలు తారా స్థాయికి చేరుతున్నాయి.ఇద్దరి మద్దతు దారులు ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే రాజకీయ వాతావరణం కనిపిస్తోంది.
తాజాగా అలీపై శివాజీ రాజా చేసిన ఆరోపణలు మరియు ఇతర మా సభ్యులపై చేసిన విమర్శలు ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం హాట్ టాపిక్గా ఉంది.అలీ తన 30 సంవత్సరాల స్నేహంకు నమ్మక ద్రోహం చేస్తాడని తాను అస్సలు ఊహించలేదు అని, ఈ ఎన్నికల్లో ఒకరు పోటీ చేస్తే మరొకరు పోటీ చేయవద్దని ముందు ఒక ఒప్పందంకు వచ్చాము.
ఆ ఒప్పందం ప్రకారం తాను పోటీకి నో చెప్పడంతో నేను రంగంలోకి దిగాను.కాని అనూహ్యంగా అలీ పోటికి దిగడంతో తాను తప్పుకున్నట్లుగా శివాజీ రాజా చెప్పుకొచ్చాడు.
తనను ఎవరో బెదిరిస్తే నామినేషన్ వెనక్కు తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలను ఈయన తోసిపుచ్చాడు.తాను గతంలో మాలో పలు పదవులు చేపట్టానని, ఇప్పుడు మా ఆఫీస్ మొహం కూడా చూడాలనిపించడం లేదని ఈయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈయన ఇద్దరు వ్యక్తులపై చాలా ఘాటైన విమర్శలు చేస్తున్నాడు.ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే విషయం మాత్రం చెప్పడం లేదు.