మంచి టాలెంట్ ఉన్న హీరోగా పేరుంది, గుర్తింపు ఉంది కానీ హీరో సిద్దార్థ్ కి సరైన హిట్ మాత్రం లేదు.రీసెంట్ గా విడుదల అయిన అతని సినిమా కళావతి కి కలక్షన్ లు బాగున్నాయి అంటున్నారు కానీ ఇందులో అతని రోల్ కి పెద్ద గుర్తింపు లేదు .
ఇదివరకు లాగా వరసగా సినిమాలు కూడా చెయ్యట్లేదు.జాగ్రత్తగా కథలు ఎంచుకుని వెళుతున్నాడు .
ప్రస్తుతం జిల్ జింగ్ జాక్ అనే సినిమా ని తమిళ్ లో తీస్తూ అదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేయ్యబోతున్నాడు.ఇలాంటి పరిస్థితి లో సిద్దార్థ్ కి ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కడం విశేషం.
అయితే ఈ పురస్కారం దక్కింది సినిమాల వలనకాదట.చెన్నై వరదల సమయంలో ఇతడు చేసన సర్వీస్ ని గుర్తించి ఈ అవార్డ్ ఇచ్చినట్లు ఎన్డీటీవీ తెలిపింది.
లక్షలాది మంది ప్రజలు వరదల్లో ఇరుక్కుపోయి నానా కష్టాలు పడుతున్న సమయంలో.తనంతట తనే స్వచ్ఛందంగా సాయం చేశాడు సిద్ధూ.
సహాయం అంటే విరాళం ఇచ్చి ఊర్కోవడం కాకుండా.ఆ వరద నీటిలో నుంచి వీలైనంతమందిని బయటకు తీసుకొచ్చాడు.
తన ఇల్లు కూడా వరదనీటిలో మునిగిపోయినా.ఇతరుల సాయం చేస్తూ మొత్తం తమిళ ఇండస్ట్రీ కదిలి రావడానికి కారణమయ్యాడు.