టాలీవుడ్లో కలెక్షన్ కింగ్గా విలక్షణమైన నటుడిగా పేరున్న మోహన్ బాబు పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు ఉన్నా ఆయన మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు.వైసీపీ అధినేత జగన్ మోహన్బాబుకు అల్లుడు అవ్వడంతో మోహన్బాబు వైసీపీలోకి వెళతారని ముందుగా వార్తలు వచ్చాయి.
తర్వాత ఆయన టీడీపీలోకి వెళతారని.ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్న వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మరో టాక్ వచ్చింది.
ఈ వార్తలు ఎలా ఉన్నా ఇప్పుడు ఇదే ఫ్యామిలీకి చెందిన మరో హీరో టీడీపీ వైపు చూస్తున్నట్టు కొత్త టాక్ బయటకు వచ్చింది.మోహన్బాబు తన గురువు దాసరితో కలిసి వైసీపీలోకి వెళతారని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే ప్రతిపాదన పెండింగ్లో పడడం వెనక ఆయన చిన్నకుమారుడు మంచు మనోజ్ ఉన్నాడని టాక్.
మోహన్బాబు ఆలోచన ఎలా ఉన్నా…మనోజ్ మాత్రం టీడీపీలోకే వెళ్లాలని పట్టుబడుతున్నాడట.
మనోజ్ మోహన్బాబుతో పాటు విష్ణుపై ఈ విషయంలో ఒత్తిడి చేయడంతో మోహన్బాబు పొలిటికల్ రీ ఎంట్రీ ఆలస్యమవుతోన్నట్టు తెలుస్తోంది.మనోజ్ బాలయ్యతో చాలా సన్నిహితంగా ఉంటాడు.
గతంలో వీరిద్దరు కలిసి ఊకొడతారా.? ఉలిక్కి పడతారా…? సినిమాలో కూడా నటించారు.
ఇక మోహన్బాబు కూడా ముందుగా బంధుత్వం దృష్ట్యా వైసీపీలోకి వెళ్లాలని అనుకున్నా ఇప్పుడు మనోజ్ ఒత్తిడితో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం దృష్ట్యా టీడీపీలోనే చేరతారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.మరి మోహన్బాబు, మనోజ్ టీడీపీలో చేరితే రాజకీయంగా అది సరికొత్త పరిణామాలకు దారి తీస్తుందనడంలో సందేహం లేదు.