నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’.జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్, మోహన్ రూపా ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మాతలుగా సినిమా రూపొందింది.
సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు.ఇళయరాజా సంగీతం అందించిన 999వ సినిమా ఇదే కావడం కొసమెరుపు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వినపడుతుంది.అదేంటంటే ఈ సినిమా కథ గతంలో విడుదలైన ‘జోడి’ సినిమాను పోలి ఉంటుందట.
ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించిన ‘జోడి’ తమిళం, తెలుగులో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.ఆ సినిమాలో హీరో హీరోయిన్లుగా తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం హీరో ఇంటికి హీరోయిన్, హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లి అక్కడే ఉండి తమ ప్రేమను సక్సెస్ చేసుకుంటారు.
ఇదే పాయింట్తో సినిమా ఉంటుందని వార్తలు వినపడుతున్నాయి.అంతే కాకుండా ఈ ట్రెండ్ కు తగిన విధంగా సినిమాలో లిప్ లాక్లు, ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు కూడా జత చేశారని సమాచారం.