సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ఆగాడు సినిమా 2014 లో విడుదల అయ్యి మహేష్ బాబు కెరీర్ లో నే అతిపెద్ద డిసాస్టర్ గా మారింది.ఇప్పుడు ఈ సినిమా కేరళలో బాగా ఫేమస్ అయిన బద్ర కాళీ అనే డిస్ట్రిబ్యూటర్ చేతుల మీదగా విడుదల అవుతోంది.
అక్కడ పోకిరీ పోలీస్ అనే పేరు మీద విడుదల కి సిద్దం చేసారు.గతంలో మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా మళయాల వర్షన్తో పాటు ‘శ్రీమంతుడు’ తమిళ వర్షన్ అయిన ‘సెల్వందన్’ సైతం కేరళలో మంచి కలెక్షన్స్ సాధించి మహేష్కు కొంత ఫ్యాన్ బేస్ను తెచ్చిపెట్టింది.
సో ఆ బేస్ ని ఉపయోగించుకుని ఈ సినిమా ని అక్కడ విడుదల చేస్తున్నారు.మహేష్ తో ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా తెలుగులో బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టాలు చవిచూసింది.