కీడ్నీలు చాలా సెన్సిటివ్ అని చెప్పాలి.ఇన్ఫెక్షన్స్ , స్టోన్స్ అంటూ పలురకాల సమస్యలు ఒకేసారి దాడి చేయవచ్చు కిడ్నీలను.
అందులో కీడ్నిల్లో రాళ్ళు రావడం అనేది ఎక్కువగా కనిపించే సమస్య.మన ఇంటి దగ్గరో, చుట్టాల్లోనో .ఇలాంటి సమస్యతో బాధపడేవారిని చూస్తుంటాం.ఇలా జరిగినప్పుడు డాక్టర్ ని సంప్రదించడం అనివార్యమే అయినా, మనవంతుగా ఒక రాయిలను కరిగించేదుకు రాయి వేయాలి.
అంటే మేం ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ తాగాలి.
ఈ స్పెషల్ జ్యూస్ తయారి కోసం నిమ్మకాయలు, ఆలీవ్ ఆయిల్, దానిమ్మ అవసరం.
ఓ కప్పు తీసుకొని దాంట్లో ముప్పావు శాతం దాన్నిమ్మ రసం పిండండి.ఆ తరువాత దాంట్లోకి రెండు తీస్పూనుల నిమ్మరసం, ఒక టీస్పూను ఆలివ్ ఆయిల్ పోసి బాగా కలపండి.
అంతే మీ జ్యూస్ రెడి.దీన్ని రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోండి.
క్రమం తప్పకుండా తాగేలా అలవాటు పడండి.
ఈ జ్యూస్ కిడ్నీల దాకా చేరి టాక్సిన్స్ ని వదిలిస్తుంది.
అంతే కాకుండా దీంట్లో ఉన్న ఆసిడిక్ లక్షణాలు రాళ్ళను కరిగించేందుకు సహాయపడతాయి.