సూపర్ స్టార్ మహేష్ ‘శ్రీమంతుడు’ సినిమా కోసం ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాలున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోయింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాలకు కలిపి 65 కోట్ల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ బిజినెస్ చేసినట్లుగా తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి సమాచారం అందుతోంది.ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ మాటీవీ ఈ సినిమాను భారీ మొత్తం పెట్టి దక్కించుకుంది.
తెలుగుతో పాటు హిందీ శాటిలైట్ రైట్స్కు గాను 17 కోట్లను మాటీవీ మరియు స్టార్ ఛానెల్లు సంయుక్తంగా చెల్లించాయని అంటున్నారు.‘మిర్చి’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్బాబు స్టైలిష్ లుక్లో కనిపించనున్నాడు.
శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు మరియు రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య పాత్రలో నటించారు.ఆగస్టు 7న తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ఈ సినిమా విడుదల కాబోతుంది.
తమిళంలో కూడా ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది.