తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్నాధ్ సింగ్ను కలిసిని ‘బాహుబలి’ ప్రభాస్ ఆ తర్వాత ప్రధాని మోడీని కలిశారు.పెద నాన్న కృష్ణం రాజుతో కలిసి ప్రభాస్ ప్రధాని మోడీని కలవడం జరిగింది.
దాదాపు పది నిమిషాల సమయం పాటు మోడీతో ప్రభాస్ మరియు కృష్ణం రాజులు మోడీతో మాట్లాడారు.ఈ సందర్బంగా మోడీని ‘బాహుబలి’ చూడాల్సిందిగా ప్రభాస్ కోరినట్లుగా తెలుస్తోంది.
అందుకు మోడీ కూడా వీలు చూసుకుని తప్పకుండా ‘బాహుబలి’ని చూస్తాను అంటూ హామీ ఇచ్చారట.
ప్రభాస్ను కలిసిన విషయాన్ని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
బాహుబలిని నేడు కలిసినట్లుగా మోడీ టిట్టర్లో చెప్పుకొచ్చారు.ఇక ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ రెండు వారాలు అయినా కూడా భారీగానే వస్తున్నాయి.
ఊహించని స్థాయిలో ఇప్పటి వరకు ఈ సినిమా 350 కోట్లు వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది.భారీ అంచనాల నడుమ విడుదలై ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి.
ఇండియన్ టాప్ మూవీస్లో ఈ సినిమా స్థానం సంపాదించిన విషయం తెల్సిందే.ఈ సినిమాను ప్రధాని మోడీ చూస్తే మరో అరుదైన గౌరవం దక్కినట్లు అవుతుంది.
మరి మోడీ ఈ సినిమాను చూస్తారో లేదో చూడాలి.