మలయాళంలో మమ్ముటి, మీనా జంటగా నటించి సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమా ఇప్పటికే తెలుగులో వెంకటేష్, మీనా జంటగా తెరకెక్కి విడుదలై మంచి విజయం సాధించింది.ఇక ఈ సినిమా తమిళంలో కూడా రీమేక్ అయ్యింది.
తమిళ రీమేక్లో కమల్ హాసన్ మరియు గౌతమిలు జంటగా నటించారు.చాలా కాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరు కలిసి నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక ఈ సినిమాకు తమిళంలో ‘పాపనాశనం’ అనే టైటిల్ను ఇప్పటికే ఫిక్స్ చేశారు.తాజాగా ఈ రీమేక్ డేట్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
కమల్ హాసన్, గౌతమి ముఖ్య పాత్రల్లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రాన్ని తెరకెక్కించిన జీతూ జోషెఫ్ తమిళ రీమేక్కు కూడా దర్శకత్వం వహించాడు.‘పాపనాశనం’ చిత్రాన్ని వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ను సెన్సార్ బోర్డు జారీ చేసింది.
మలయాళం మరియు తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమా తమిళంలో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.త్వరలోనే బాలీవుడ్లో సైతం ‘దృశ్యం’ సినిమా రీమేక్గా రాబోతుంది.