టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘బాహుబలి’.ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 31న జరపాలని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించారు.
భారీగా నిర్వహించతలపెట్టిన ఈ ఆడియో వేడుకకు పోలీసుల నుండి అనుమతి దక్కలేదు.దాంతో వాయిదా వేయడం జరిగింది.
ఈ ఆడియో విడుదల వాయిదా వెనుక కుట్ర జరిగిందా అనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల్లో జరుగుతోంది.సినీ పరిశ్రమకు చెందిన కొందరు తమకున్న పలుకుబడితో ఆడియో వేడుకకు పోలీసుల అనుమతి రాకుండా చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లే ఈ సినిమాపై ఇలాంటి చీప్ ట్రిక్స్ను ప్లే చేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఇలా చేసిన వారు ఏం ఆశిస్తున్నారో అని కొందరు అంటున్నారు.అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మొత్తం పుకార్లు మాత్రమే అని, ఊహాజనితం అంటూ మరి కొందరు కొట్టి పారేస్తున్నారు.
‘బాహుబలి’ ఆడియోను ఆపడం ఏ ఒక్కరికి మాత్రం ఉపయోగదాయం, అలా చేసి వారు ఏం సాధించాలని అనుకుంటున్నారు అని కొందరు అంటున్నారు.మొత్తానికి ‘బాహుబలి’ ఆడియో టాపిక్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది.