సూపర్ హిట్ మూవీ ‘కిక్’కు సీక్వెల్గా తెరకెక్కిన చిత్రం ‘కిక్`2’.రవితేజ, రకుల్ ప్రీత్సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.
ఈనెలారంభంలోనే విడుదల కావాల్సి ఉన్నా కూడా ఇప్పటికి కూడా ‘కిక్`2’ ప్రేక్షకుల ముందుకు రాలేదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్12న విడుదల చేయాలని నిర్మాత కళ్యాణ్ రామ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా విడుదల ఆలస్యం వెనుక ఆర్థిక పరమైన విషయాలు కారణం అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.‘కిక్`2’ సినిమాను కళ్యాణ్ రామ్ దాదాపుగా 40 కోట్ల బడ్జెట్తో చాలా స్టైలిష్గా, భారీగా నిర్మించాడు.అయితే ఇప్పుడు అంత బడ్జెట్ బిజినెస్ చేయాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నాడు.అయితే రవితేజకున్న క్రేజ్ దృష్ట్యా అన్ని ఏరియాలకు కలిపి 30 కోట్లు మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా మరో అయిదు కోట్లు మాత్రమే వస్తున్నాయి.
దాంతో కళ్యాణ్ రామ్ ఆలస్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.విడుదలకు ముందే తాను పెట్టిన బడ్జెట్ను రాబట్టుకోవాలనే ఉద్దేశ్యంతో కళ్యాణ్ రామ్ ఇలా చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి అనధికారిక సమాచారం అందుతోంది.
జూన్ 12న అయినా ‘కిక్`2’ వచ్చేనా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.