తిట్టిన నోటితోనే ఇక పొగడాలి....!

ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెసు పార్టీకి రాష్ర్ట అద్యక్షుడిగా పని చేసిన విజయనగరం జిల్లా నాయకుడు బొత్స సత్యనారాయణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట…! ఒకప్పుడు ఆయన భాజపాలో చేరతారనే వార్తలు బాగా షికారు చేశాయి.కాని ఆ పార్టీ మొండి చేయి చూపించడంతో వైకాపాలో చేరుతున్నాడు.

 Botsa Satyanarayana To Join Ysrcp-TeluguStop.com

వైఎస్‌ జగన్‌ కూడా ఇందుకు పచ్చ జెండా ఊపాడట.మరి పార్టీలో ఏం పదవి ఇస్తారో చూడాలి.

కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ ప్రతి రోజూ జగన్‌ను నానా బూతులు తిట్టాడు.ఆ తిట్టిన నోటితోనే ఇక పొగడ్తలు మొదలుపెడతాడేమో.

ఎంతటి నాయకుడికైనా అధినేతను పొగడక తప్పదు కదా.సత్తిబాబుకు కాంగ్రెసు మీద నమ్మకం పోయినట్లు ఉంది.ఇక ఆ పార్టీ బతికి బట్ట కట్టదని డిసైడైపోయాడా? లేక పార్టీలో తగిన గౌరవం ఇవ్వడం లేదా? జగన్‌ ఎంతటివారిపైనా పురుగుల్లా చూస్తాడని అంటారు.మరి పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా పని చేసిన బొత్సకు వైకాపాలో తగిన గౌరవం లభిస్తుందా? జగన్‌కు నమ్మిన బంట్లే బయటకు వచ్చేశారు.మరి విజయనగరం రాజావారు ఎన్నాళ్లు ఉంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube