హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అయిన ఈ సమయంలో నటకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ, స్కిన్ షోకు దూరంగా ఉంటూ వస్తున్న హీరోయిన్ నిత్యామీనన్.‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిత్యామీనన్.
ఈ అమ్మడు కెరీర్ ప్రారంభం నుండి కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, చేసిన తక్కువ సినిమాలతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటికే నటిగా పలు సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నిత్యామీనన్ తాజాగా మరోసారి ‘ఓకే బంగారం’ సినిమాతో నటిగా మరో స్టెప్ను ఎక్కింది.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం’ సినిమాలో నటించిన నిత్యామీనన్ సినిమాకే హైలైట్గా నిలిచింది.తాజాగా తెలుగు మరియు తమిళంలో విడుదలైన ‘ఓకే బంగారం’ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.
ముఖ్యంగా నిత్యామీనన్ నటనకు ప్రత్యేకంగా మార్కులు పడుతున్నాయి.హీరో దుల్కర్ సల్మాన్ను మించిన నటనను ఈ అమ్మడు కనబర్చింది.నటనలో సౌత్ ఇండియాలో తాను నెం.1 అని మరోసారి నిరూపించుకుంది నిత్యామీనన్.నిత్యామీనన్ నెం.1
.