అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఈనెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఈ సినిమాకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ మరియు వీరిద్దరు విడి విడిగా చేసిన ‘అత్తారింటికి దారేది’ మరియు ‘రేసుగుర్రం’ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.దాంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
అంచనాలను ఏమాత్రం తప్పం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఈనెల 9వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమాకు పలు థియేటర్లలో బెనిఫిట్ షోలు వేస్తున్నారు.హైదరాబాద్ కుకట్పల్లిలోని భ్రమరాంభ థియేటర్లో ఈ సినిమా బెన్ఫిట్ షోను వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే బెన్ఫిట్ షో టికెట్లు కూడా అమ్ముడు పోయాయి.ఒక్క టికెట్ ధరను ఏకంగా వెయ్యి పెట్టి మరి అభిమానులు కొనుగోలు చేశారు.
ఇక విడుదల రోజు బ్లాక్లో మూడు నుండి అయిదు వేల వరకు కూడా పలికే అవకాశాలున్నాయి.మొత్తానికి ఈ సినిమాకున్న క్రేజ్ ఏంటో ఈ టికెట్ రేట్లు చెప్పకనే చెబుతున్నాయి.