మనిషి చనిపోయిన తరువాత ఎక్కడికి వెళతాడు? అసలు స్వర్గం నరకం లాంటివి నిజంగానే ఉన్నాయి.పాపాలు చేస్తే నరకానికి పుణ్యాలు చేస్తే స్వర్గానికి నిజంగానే వెళ్తారా? ఈ శిక్షను అమలుపరిచేదెవరు? స్వర్గంలో సుఖాలనిచ్చేది ఎవరు? మనిషిలో నిజంగానే ఆత్మ ఉందా? అసలు దేవుడనేవాడు నిజంగానే ఉన్నాడా?
చనిపోయిన తర్వాత ఏమోగానీ, బ్రతికి ఉన్నంత కాలం మాత్రం మనిషి ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కనుక్కోవడం చాలా కష్టమైన విషయం.చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆత్మహత్య చేసుకున్న వారూ ఉన్నారు.ఇలాంటి పిచ్చి ప్రయోగాలు ఎన్నో జరిగాయి ఈ ప్రపంచంలో
ఓ ఎనిమిదేళ్ల పాప మాత్రం తాను చావుని చూశానని, స్వర్గానికి వెళ్లానని, అక్కడ దేవుడిని చూశానని, దేవుడే నన్ను తిరిగి ఈ లోకానికి పంపించాడని, తిరిగి బ్రతికించాడని చెబుతోంది.
ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ పాప ఒక సెన్సేషన్.
మతం మనుషులు ఈ పాప చెప్పేది నిజం, ఆమె అదృష్టవంతురాలు అంటూ మురిసిపోతుంటే, ఏమిటి పిట్ట కథలు, పిచ్చొళ్ళే వీటిని నమ్ముతారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు సైన్సు మనుషులు.
ఇక అసలు విషయం లోకి వెళదాం
ఎనిమిదేళ్ల ఆనాబెల్ బీమ్ కి ఒక డిజార్డర్ ఉంది.ఆ డిజార్డర్ వలన ఆమెకు కడుపులో విపరీతమైన నొప్పి వేస్తుంది.
నాలుగేళ్లుగా పాపం ఆ పాపను తీవ్రంగా హింసిస్తోంది ఆ నొప్పి.దాంతో తనకు బ్రతకాలని లేదని, ఈ నొప్పిని జీవితాంతం భరించడం తనవల్ల కాదని, చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్లిపోయి స్వర్గంలో సుఖంగా ఉంటానని తరుచుగా చెప్పేదట బీమ్.
ఓ రోజు తన సోదరితో పాటు ఓ పెద్ద చెట్టు మీద కూర్చుంది ఈ చిన్నారి.దురదృష్టవశాత్తు పట్టుతప్పి 30 ఫీట్ల ఎత్తునుంచి కిందపడిపోయింది.
దాంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసిందట.