త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, పూరి జగన్నాథ్, సుకుమార్, వంశీ పైడిపల్లి … ఏదో ప్రయాణానికి టికేట్ బుక్ చేసుకోవడానికి పోటీ పడ్డట్టు, వీళ్ళంతా మహేష్ బాబు డేట్స్ బుక్ చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమంతుడు సినిమాకి ముందే నుంచే మహేష్ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికి కొన్ని కథలు వినిపించేసారు.గత సంవత్సరం మహేష్ పుట్టినరోజుకి తాను, నిర్మాత రాధకృష్ణ కలిసి మహేష్ తో సినిమా చేస్తున్నట్లు పేపర్ యాడ్ కూడా ఇచ్చేసారు.అయితే మహేష్ 24వ సినిమా అయితే త్రవిక్రమ్ చేతిలో లేదు.25వ చిత్రానికి మాత్రం ముందు వరుసలో ఉన్నది మాటల మాంత్రికుడే.
కొరటాల అయితే మహేష్ తో తదుపరి సినిమా తనదే అన్న గట్టి నమ్మకంతో ఉన్నారు.ఇప్పటికి కథ రాయడం మొదలుపెట్టేసారు.మహేష్ తరువాతి సినిమా కొరటాల దర్శకత్వంలోనే అని ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి.
ఇక వంశీ పైడిపల్లి .నిన్న పేపర్ యాడ్ ఇచ్చేసాడు ఈ యువ దర్శకుడు.పివిపి నిర్మాణంలో ఈ సినిమా ఉంటుంది.
ఇదే మహేష్ 24వ సినిమా పివిపి ప్రకటించింది.
ఇక 25వ సినిమా కోసం తీవ్రపోటి ఉంది.
జనగణమన పేరుతో పూరి జగన్నాథ్ టైటిల్ కూడా అన్నౌన్స్ చేస్తే, ఈసారి ఖచ్చితంగా హిట్ సినిమా తీస్తానని సుకుమార్ సంవత్సరకాలంగా సూపర్ స్టార్ ని అడుగుతున్నాడు.మరోవైపు 25వ సినిమా త్రివిక్రమ్ దే సినీవర్గాల టాక్.24వ సినిమా కొరటాల చేతిలో పడితే, 25వ సినిమా కోసం వంశీ పైడిపల్లి కూడా పోటిపడాలి.
ఎవరికి వారు పేపర్ యాడ్స్ ఇస్తున్నారు .ప్రకటనలు చేస్తున్నారు.మహేష్ మాత్రం మురుగదాస్ సినిమాలో బిజీగా ఉంటూ, ఎవరికి పూర్తిగా అందకుండా ఊరిస్తున్నాడు.