అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటి సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను యువ హీరో నితిన్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
అఖిల్ మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.దాంతో ఈ సినిమాకు భారీ బిజినెస్ అవుతుందనే ఉద్దేశ్యంతో నితిన్ అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేస్తున్నాడు అంటూ టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
మొదట 30 కోట్ల బడ్జెట్ అనుకున్న ఈ సినిమా చివరకు 50 కోట్లు చేరేలా ఉంది అంటూ ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
వినాయక్ గత చిత్రం ‘అల్లుడు శీను’ను 15 నుండి 20 కోట్లతో తెరకెక్కించాని భావించినా చివరకు అది కాస్త 35 కోట్ల బడ్జెట్ను రీచ్ అయ్యింది.
దాంతో ఆ సినిమా సక్సెస్ అయినా నిర్మాతకు 10 నుండి 15 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.దాంతో ఈ సినిమా కూడా బడ్జెట్ మించితే నిర్మాత నితిన్కు కష్టాలు తప్పవు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే విషయాన్ని తాజాగా నాగార్జున కూడా నితిన్ వద్ద చర్చించినట్లుగా తెలుస్తోంది.అఖిల్ మొదటి సినిమా కనుక మార్కెట్ను బట్టి ఖర్చు చేయాలని వినాయక్ మరియు నితిన్తో నాగ్ చెప్పడని అంటున్నారు.
ఈ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్దం అవుతోంది.