టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం సంచలనాలకు మారు పేరుగా నిలిచిన విషయం తెల్సిందే.దాదాపు 150 కోట్లతో ‘బాహుబలి’ తెరకెక్కింది అంటూ ప్రచారం జరిగింది.
అందులో 50 కోట్లకు పైగా విజువల్ ఎఫెక్ట్స్కే జక్కన్న వినియోగించాడు అనే పుకార్లు కూడా షికారు చేశాయి.కాని తాజాగా ఈ సినిమా బడ్జెట్పై వస్తున్న పుకార్లపై తాజాగా జక్కన్న క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమా విజుల్ ఎఫెక్ట్స్ కోసం జక్కన్న ఖర్చు చేసింది కేవలం 22 కోట్టేనట.తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
కేవలం 22 కోట్లతో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ను ‘బాహుబలి’లో పెట్టిన జక్కన్నకు సినీ వర్గాల వారు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.ఇక ప్రస్తుతం జక్కన్న ‘బాహుబలి’ రెండవ పార్ట్ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
రెండవ పార్ట్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని, షూటింగ్ కూడా మొదలైంది.పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే భారీ చిత్రాన్ని కూడా తక్కువ బడ్జెట్తో పూర్తి చేయవచ్చు అని రాజమౌళి నిరూపించాడు.
‘బాహుబలి’ వంటి భారీ సినిమాను ముందస్తు ప్లానింగ్తో జక్కన్న తెరకెక్కించి దాదాపు 30 శాతం బడ్జెట్ను ఆదా చేయడం జరిగింది.ఇక రెండవ పార్ట్ విజువల్ ఎఫెక్ట్స్కు జక్కన్న ఎంత ఖర్చు చేస్తాడో చూడాలి.