క్రూరంగా రేప్ చేసి, ప్రైవేట్ పార్ట్స్ లో పిస్టల్ పెట్టిన దారుణం

వినడానికే వణికిపోయేలా, ఛీ … మనుషులు కాదు మృగాలు అనేంత అనాగరికంగా ఒక బిహార్ యువతిని అతిదారుణంగా రేప్ చేసారు.ఓరకంగా ఢిల్లీలో జరిగిన నిర్భయ రేప్ కేసు తలపిస్తోంది తాజాగా బిహార్ లోని మొతిహారిలో జరిగిన సంఘటన.

 21-year-old Girl Brutally Gangraped In Bihar’s Motihari-TeluguStop.com

ఇంకా పూర్తి వివరాలు మీడియా చేతికి చిక్కలేదు కాని, మొతిహారిలో ఉంటున్న ఓ 21 యువతిని కొంతమంది యువకులు వేధించసాగారు.ఆమె ఎంత వద్దని వేడుకున్నా వినలేదు.

నిందితుల్లో ఒకరైన సమీఉల్లా, అతని స్నేహితలు ఒక్కసారిగా దాడి చేయడంతో, బ్లేడుతో వారిని ఎదిరించిందట ఆ యువతి.దాంతో ఆ మగగుంపు కోపం, కామం రెండు కట్టలు తెంచుకున్నాయి.

అతి దారుణంగా తనని గ్యాంగ్ రేప్ చేసారు.అక్కడితో ఆగకుండా తన జననాంగంలోకి పిస్టల్ , మరొకొన్ని చెక్కతో చేయబడిన వస్తువులు గుచ్చడంతో రక్తం ధారాలుగా కారింది.

ఇంత దారుణానికి పాల్పడుతూనే, రాక్షసుల మాదిరి చేస్తున్నదంతా వీడియోలో షూట్ చేసారు.అక్కడే రోడ్ మీద వివస్త్రగా, నెత్తురుతో వదిలేసి పారిపోయారు.

ప్రస్తుతం యువతిని హాస్పిటల్ కి తరలించారు.తన కండిషన్ సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యుల రోదనతో హాస్పిటల్ ప్రాంగణమంతా దద్దరిల్లుతోంది.

అయితే, కంప్లయింట్ ఇచ్చినా, పోలీసులు సరిగా స్పందించకపోవడం విడ్డూరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube