వినడానికే వణికిపోయేలా, ఛీ … మనుషులు కాదు మృగాలు అనేంత అనాగరికంగా ఒక బిహార్ యువతిని అతిదారుణంగా రేప్ చేసారు.ఓరకంగా ఢిల్లీలో జరిగిన నిర్భయ రేప్ కేసు తలపిస్తోంది తాజాగా బిహార్ లోని మొతిహారిలో జరిగిన సంఘటన.
ఇంకా పూర్తి వివరాలు మీడియా చేతికి చిక్కలేదు కాని, మొతిహారిలో ఉంటున్న ఓ 21 యువతిని కొంతమంది యువకులు వేధించసాగారు.ఆమె ఎంత వద్దని వేడుకున్నా వినలేదు.
నిందితుల్లో ఒకరైన సమీఉల్లా, అతని స్నేహితలు ఒక్కసారిగా దాడి చేయడంతో, బ్లేడుతో వారిని ఎదిరించిందట ఆ యువతి.దాంతో ఆ మగగుంపు కోపం, కామం రెండు కట్టలు తెంచుకున్నాయి.
అతి దారుణంగా తనని గ్యాంగ్ రేప్ చేసారు.అక్కడితో ఆగకుండా తన జననాంగంలోకి పిస్టల్ , మరొకొన్ని చెక్కతో చేయబడిన వస్తువులు గుచ్చడంతో రక్తం ధారాలుగా కారింది.
ఇంత దారుణానికి పాల్పడుతూనే, రాక్షసుల మాదిరి చేస్తున్నదంతా వీడియోలో షూట్ చేసారు.అక్కడే రోడ్ మీద వివస్త్రగా, నెత్తురుతో వదిలేసి పారిపోయారు.
ప్రస్తుతం యువతిని హాస్పిటల్ కి తరలించారు.తన కండిషన్ సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యుల రోదనతో హాస్పిటల్ ప్రాంగణమంతా దద్దరిల్లుతోంది.
అయితే, కంప్లయింట్ ఇచ్చినా, పోలీసులు సరిగా స్పందించకపోవడం విడ్డూరం.