సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ చిత్రం తెలుగులో 40 కోట్లను వసూళ్లు చేసింది.దాంతో ఆయన తాజా చిత్రం ‘ఐ’ను తెలుగులో దాదాపుగా 40 కోట్లకు సూపర్ గుడ్ ఫిల్మ్ సంస్థ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగులో కూడా ‘ఐ’ సినిమాకు వచ్చిన స్పందనతో నిర్మాత పెట్టుబడిని సింపుల్గా రాబట్టుకోవచ్చని ఆశించాడు.అయితే అనుకున్నది ఒక్కటి, అయినది మరోటి.40 కోట్లు పెట్టి తీసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ 28 కోట్ల వద్ద క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది.దాదాపుగా నిర్మాతకు 12 కోట్ల నష్టం వచ్చిందని ట్రేడ్ విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది.
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో సంక్రాంతి కానుకగా విడుదలైంది.సంక్రాంతి పండుగ వల్ల ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.కాని ఆ తర్వాత ఆ కలెక్షన్స్ లాంగ్ రన్లో రాబట్టడంలో ఈ చిత్రం విఫలం అయ్యింది.దాంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు.
ఇక మొత్తంగా చూసుకుంటే ‘ఐ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 200 కోట్లు వసూళ్లు చేసిందని అంటున్నారు.ఈ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ సేఫ్ అయ్యాడని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
కాని తెలుగు నిర్మాత మాత్రం కోట్లల్లో నష్టపోవాల్సి వచ్చింది.