క్షణికావేశంలో జరిగే కొన్ని సంఘటనలు మనిషి ప్రాణాల మీదకి తెస్తున్నాయి.ఎన్నో నేరాలు ,ఘోరాలు కేవలం విచక్షణ కోల్పోవడం వలెనే జరుగుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం.
క్షణికావేశంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.బెంగుళూరు లో ఉంటున్న ఒక కుటుంభం లో జరిగిన దారుణం ఇది.తమ సోదరిని బలాత్కారం చేసి .గర్భం తెప్పించాడు అని భావించిన ఆ అమ్మాయి సోదరులు ఆ ఆవేశంలో తమ కోపాన్ని తీర్చుకోవడానికి చాలా ఘోరానికి పాల్పడ్డారు
సోదరిని గర్భవతిని చేసిన యువకుడిని అతి కిరాతకంగా చంపేశారు అంతేకాదు అత్యంత దారుణంగా అతడి తల నరికి తమ పైశాచికత్వాన్ని చూపించారు అంతటితో కూడా ఆగకుండా అతని పురుషాంగాన్ని కూడా కోసేసి.కసి తీర్చుకున్నారు.ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది
విషయం లోకి వెళ్తే ఒడిసాకు చెందిన గాంధీ జె.రాయ్ (19) – మధు జె.రాయ్ (21)లు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు.అక్కడి ఓ వస్త్ర పరిశ్రమలో పనిలో చేరారు .ఇంతలో వారి సోదరి కూడా ఉపాధి నిమిత్తం వీరితో జతకలిసింది.వీరంతా కలిసి ఒకే పరిశ్రమలో పనిచేస్తున్నారు.అయితే కొంతకాలానికి ఒడిసాకి చెందిన మరొక యువకుడు కూడా అదే చోట పనిలో చేరాడు .ఇటీవల తమ సోదరి అస్వస్థతకు గురికావడంతో సోదరులు ఇద్దరూ ఆమెను సమీపంలోని ఓ ఆస్పత్రిలో చూపించారు.అయితే ఆమె అప్పటికే గర్భవతి అని డాక్టర్లు వెల్లడించడంతో సోదరులు నిర్ఘాంత పోయారు.
ఆమె నుంచి నిదానంతా విషయం అడిగి తెలుసుకున్నారు
తానూ గర్భం దాల్చడానికి కొత్తగా చేరిన బిరాంచీ కారణమని తెలుసుకున్న వాళ్ళు షాక్ కి గురయ్యారు.ఎలాగైనా బిరాంచీ మీద కసి తీర్చుకోవాలని భావించిన సోదరులు.
అతనితో స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ మందు తాగుదాం అని పిలిచి, అతనిని బిరాంచిని ఎలక్ర్టానిక్ సిటీ నైస్ టోల్ గేట్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు.ఒక్కసారిగా అతనిపై కలబడి.
కత్తితో అతడిని కసి తీరా చంపి.తలను వేరు చేశారు.
పురుషాంగాన్నీ కోశారు.ఈ సంఘటన అనంతరం పోలీసులకి దగ్గరకి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి లొంగిపోయారు.
ఈ ఘోరమైన సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.సమస్య ప్రతీదానికి ఒక పరిష్కారం ఉంటుంది.
ఒక మనిషి అనాలోచిత ఆవేశానికి ఒక ప్రాణం బలై పోయింది.