నందమూరి నటసింహం బాలకృష్ణ తన వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన వెంటనే చాలా హుషారుగా ఉన్నాడు.కుర్ర హీరోలకి పోటీగా వరుస సినిమాతో బాలయ్య అభిమానులని అలరిస్తున్నాడు.
బాలయ్య ఇప్పుడు తన 102 సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.అంతేకాదు అందరికీ షాక్ ఇస్తూ మరొక సినిమా ప్రాజెక్ట్ కి గ్రీన్ సింగల్ ఇచ్చేశాడన్న టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ తో పటాస్ తీసి బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చాడు.ఆతరువాత సాయి ధరమ్ తో సుప్రీమ్ తీసి విజయం సాదించాడు.
ప్రస్తుతం రవితేజ హీరోగా “ రాజా ది గ్రేట్ “ సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు నటసింహం బాలయ్య బాబు కోసం ఒక కథని రెడీ చేశాడట.
అంతేకాదు ఆ కథకి కి పేరు సీనియర్ ఎన్టీఅర్ పేరు ఉండటం, కథని బలయ్యకి వినిపించడం, బాలయ్య కి నచ్చడం అంతా జరిగిపోయాయి అని టాక్.ఇప్పడు రావిపూడి ఆ కథకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట.
చాలా రోజుల నుండి ఈ ప్రాజెక్ట్ మీద చర్చలు జరుగుతున్నాయి అని ఇటీవలే బాల కృష్ణ ఫైనల్ చేశాడనే టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాని గుంటూరు కు చెందిన వాసవి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ వారు నిర్మించేందుకు సిద్దపడ్డారు అని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని టాలీవుడ్ టాక్
.