మన భారత దేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాధుడు అనే పేర్లతో పిలుస్తాం.హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు).
అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు.విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు.
హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్థన, పూజ సామాన్యము
వాస్తు ప్రకారం సరైన ప్రదేశంలో వినాయకుణ్ణి పెట్టుకొని పూజిస్తే మంచి ఫలితాలు కనపడతాయి.అసలు నిల్చున్న వినాయకుణ్ణి పూజించాలా కూర్చుని ఉన్న వినాయకుణ్ణి పూజించాలా లేదా ఏ రెండు వినాయకుణ్ణి పూజించాలి అనే సందేహం చాలా మందిలో ఉండటం సహజమే.
ఆ వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం
కూర్చుని ఉన్న వినాయకుణ్ణి పూజిస్తే గణపతి తొండం అయన ఎడమ చేతి వైపు ఉన్న విగ్రహాన్ని పెట్టుకోవాలి.అదృష్టంతో పాటు విజయం కూడా మీ సొంతం అవుతుంది.
తెలుపు రంగులో ఉన్న వినాయకుణ్ణి పూజిస్తే ప్రశాంతత,సంతోషం,ఐశ్వర్యం పొందుతారు.
ఎరుపు లేదా కాషాయం రంగు విగ్రహాన్ని పూజిస్తే అభివృద్ధి,సంపద పెరుగుతుంది.
వినాయకుడు,స్వస్తిక్ కలిసిన ఉన్న విగ్రహాన్ని పూజిస్తే వాస్తు దోషాలు పోతాయి.
వినాయకుడి విగ్రహంతో పాటు తప్పనిసరిగా ఎలుక విగ్రహం ఉండాలి
నిలబడి ఉన్న వినాయక విగ్రహాన్ని ఆఫీస్ లో పెట్టుకోవాలి.
ఈ విధంగా విగ్రహం పెట్టటం వలన అక్కడ పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యి అక్కడ పనిచేసేవారిలో ఉత్సాహం పెరుగుతుంది.
వినాయకుడికి అత్యంత ప్రతీకారంగా గరికను ప్రతి రోజు వినాయక విగ్రహానికి సమర్పించాలి.
Om Gan Ganapataye Namah అంటూ గరికతో వినాయకుణ్ణి పూజిస్తే మనకు ఉన్న ఆటంకాలు అన్ని తొలగిపోతాయి
.